Hockey India | పెర్త్: ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్కు ముందు భారత హాకీ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతున్నది. ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 0-5తో వైట్వాష్ ఎదుర్కొంది. శనివారం జరిగిన సిరీస్లో చివరిదైన ఐదో పోరులో టీమ్ఇండియా 2-3 తేడాతో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది.
కెప్టెన్ హర్మన్ప్రీత్సింగ్(4ని), బాబీసింగ్ ధామి(53ని) భారత్ తరఫున గోల్స్ చేయగా, జెరెమీ హేవర్డ్(20ని), విల్లాట్(38ని), టిమ్బ్రాండ్(39ని) ఆసీస్కు గోల్స్ అందించారు.