IND vs AUS | వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా ఈ నెల 24 నుంచి భారత్తో జరగనున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. భారత్లోనే జరుగనున్న ఈ సిరీస్తో ఇక్కడి పిచ్లపై ఒక అంచనాకు రావొచ్చని భావిస్తున్న క్రికెట్ ఆస్ట్రేలియా ఆదివారం 18 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న కంగారూ జట్టు.. నేరుగా అక్కడి నుంచే భారత్లో అడుగు పెట్టనుంది. ప్రస్తుతం సఫారీ టూర్కు దూరమైన స్టార్ ప్లేయర్లు స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్వెల్, మిషెల్ స్టార్క్కు భారత్తో సిరీస్లో చోటు దక్కింది. వివిధ కారణాల వల్ల జట్టుకు దూరమైన ఈ ముగ్గురూ టీమ్ఇండియాతో సిరీస్లో బరిలోకి దిగనున్నారు.
మెగాటోర్నీకి రిహార్సల్ లాంటి ఈ సిరీస్తో జట్టు కూర్పును పరీక్షించుకోవాలనుకుంటున్న ఆస్ట్రేలియా.. ఈ నెల 24 మొహాలీలో తొలి వన్డే ఆడనుంది. ఆ తర్వాత వరుసగా సెప్టెంబర్ 28 (ఇండోర్), అక్టోబర్ (1) రాజ్కోట్లో మ్యాచ్లు ఆడనుంది. ఇక వచ్చే నెల 5 నుంచి వరల్డ్కప్ ప్రారంభం కానుండగా.. అందులో భాగంగా భారత్ తొలి మ్యాచ్లో 8వ తేదీన చెన్నై వేదికగా ఆసీస్తో అమీతుమీ తేల్చుకోనుంది. గాయం కారణంగా టాపార్డర్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ జట్టుకు దూరం కాగా.. మాథ్యూ షార్ట్ అతడి స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. ఇక ఇటీవల దక్షిణాఫ్రికాపై కంకషన్ సబ్స్టిట్యూట్గా మైదానంలో అడుగుపెట్టి దుమ్మురేపిన లబుషేన్ కూడా టీమ్ చోటు దక్కించుకున్నాడు.
ఆస్ట్రేలియా జట్టు: కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, అలెక్స్ కారీ, నాథన్ ఎలీస్, కామెరూన్ గ్రీన్, జోష్ హజిల్వుడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లబుషేన్, మిషెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్వెల్, తన్వీర్ సంఘా, మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, మిషెల్ స్టార్క్, మార్కస్ స్టొయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జాంపా.