పెర్త్: భారత్తో పెర్త్లో జరుగుతున్న తొలి టెస్టులో(AUSvIND) ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 104 రన్స్కు ఆలౌటైంది. దీంతో భారత్కు తొలి ఇన్నింగ్స్లో 46 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో రోజు ఇవాళ ఉదయం భారత పేసర్ బుమ్రా రఫాడించాడు. ఆసీస్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లలో త్వరత్వరగా వెనక్కి పంపించాడు. బుమ్రా తొలి ఇన్నింగ్స్లో అయిదు వికెట్లు తీసుకున్నాడు. టెస్టుల్లో బుమ్రా 5 వికెట్లు తీసుకోవడం ఇది 11వ సారి. మరో బౌలర్ హర్షిత్ రాణాకు మూడు వికెట్లు దక్కాయి.
Innings Break!
Australia have been bowled out for 104 runs and #TeamIndia secure a 46-run lead. Captain @Jaspritbumrah93 leads by example taking 5 wickets, while debutant Harshit Rana gets 3 and @mdsirajofficial has 2.
It is time for Lunch on Day 2 and post that the Indian… pic.twitter.com/eryt7KsGKf
— BCCI (@BCCI) November 23, 2024
బౌలింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై.. ఆస్ట్రేలియా బ్యాటర్లు కూడా తడబడ్డారు. అయితే మిచెల్ స్టార్క్ మాత్రం కాసేపు భారత బౌలర్లను పరీక్షించాడు. 112 బంతులు ఆడిన స్టార్క్.. వ్యక్తిగతంగా 26 రన్స్ చేసి ఔటయ్యాడు. స్టార్క్ వికెట్కు అతుక్కుపోవడంతో.. భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. స్టార్క్, హేజిల్ వుడ్లు పదో వికెట్కు 110 బంతుల్లో 25 రన్స్ జోడించారు. భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.