కేప్టౌన్: దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ తొలి వామప్ పోరులో భారత్కు నిరాశ ఎదురైంది. సోమవారం జరిగిన తమ మొదటి మ్యాచ్లో టీమ్ఇండియా 44 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది.
ఆసీస్ నిర్దేశించిన 130 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 16 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. అంతకుముందు జార్జియా (32 నాటౌట్), బేత్ మూనీ (28) రాణించడంతో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 129/8 స్కోరు చేసింది.