హనుమకొండ చౌరస్తా: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ టోర్నీలో రంగారెడ్డి జట్టు ఓవరాల్ విజేతగా నిలిచింది. గురువారం జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ముగిసిన టోర్నీలో విజేతలకు ట్రోఫీలతో పాటు పతకాలు అందజేశారు. ముగింపు కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్ క్రీడలకు పెద్దపీట వేస్తున్నారు. హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్ను స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సారంగపాణి, రాజేశ్వర్రావు, అశోక్కుమార్ పాల్గొన్నారు.