గ్వాటెమాల సిటీ: భారత స్టార్ ఆర్చర్లు అతాను దాస్, దీపిక కుమారి నిలకడైన ప్రదర్శనతో ప్రపంచకప్ రికర్వ్ వ్యక్తిగత విభాగాల్లో సెమీస్ చేరారు. గతేడాది వివాహం చేసుకున్న అతాను, దీపిక దాదాపు రెండేండ్ల తర్వాత ప్రపంచకప్లో అడుగుపెట్టి సత్తాచాటారు. శుక్రవారం జరిగిన మహిళల క్వార్టర్స్లో మిచెలీ క్రోపెన్ (జర్మనీ)పై దీపిక.. పురుషుల క్వార్టర్స్లో ఎరిక్ పీటర్స్ (కెనడా)పై అతాను గెలుపొందారు.