హామిల్టన్ (న్యూజిలాండ్): దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య రెండో ఆసక్తికరంగా సాగుతున్నది. ఇప్పటికే రెండు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో ఉన్న కివీస్..సొంతగడ్డపై సఫారీలకు పరీక్ష పెడుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా మంగళవారం తొలి రోజు ఆట ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. ర్యువాన్ డీ స్వార్ట్ (55) అజేయ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర(3/33) రాణించాడు. రచిన్ తన స్పిన్ మాయాజాలంతో హమ్జా (20), బెడింగ్హామ్ (39), పీటర్సన్(2)ను పెవిలియన్ పంపాడు. స్వార్ట్, వాన్బెర్గ్ (34 నాటౌట్) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.