న్యూఢిల్లీ: ఆసియా టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్షిప్ డబుల్స్లో భారత్ రెండు కాంస్యాలు చేజిక్కించుకుంది. ఈ టోర్నీలో తొలిసారి టీమ్ ఈవెంట్లో పతకం పట్టి చరిత్ర సృష్టించిన భారత్.. తాజాగా మరో రెండు పతకాలు ఖాతాలో వేసుకుంది. ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్స్లో శరత్ కమల్-సాతియాన్, హర్మీత్ దేశాయ్-మానవ్ ఠక్కర్ జోడీ ఓటమిపాలై రెండు కాంస్యాలు గెలుచుకున్నాయి. తొలి సెమీస్లో హర్మీత్-మానవ్ జంట 2-3 (4-11, 6-11, 12-10, 11-9, 8-11)తో ఊజిన్ జాంగ్-జాంగ్హుంగ్ (దక్షిణ కొరియా) ద్వయం చేతిలో ఓడింది. మరో సెమీస్లో శరత్-సాతియాన్ ద్వయం 0-3 (5-11, 9-11, 11-13)తో యూకి యా ఉడా-షున్సుకె జపాన్ జోడీ చేతిలో ఓడింది.