బీజింగ్: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వాయిదా పడ్డ ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడలను వచ్చే ఏడాది సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు నిర్వహించాలని ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) నిర్ణయించింది. షెడ్యూల్ ప్రకారం గ్వాంగ్జు వేదికగా ఈ ఏడాది సెప్టెంబర్ 10 నుంచి 25 మధ్య ఆసియా క్రీడలు జరుగాల్సి ఉన్నా.. చైనాలో కొవిడ్-19 ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈ ఏడాది మే 6న క్రీడలను వాయిదా వేశారు. ‘రెండు నెలలుగా ఈ అంశంపై సమాలోచనలు జరిపాం. ఇతర అంతర్జాతీయ టోర్నీలకు అడ్డు రాకుండా కొత్త తేదీలను సిద్ధం చేశాం’ అని ఓసీఏ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.