హాంగ్జౌ: చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల రోయింగ్ విభాగంలో భారత్ ఐదో పతకం నెగ్గింది. మెన్స్ క్వాడ్రబుల్ స్కల్స్ విభాగంలో భారత్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకుంది. 6:08:61 నిమిషాల టైమింగ్తో సత్నామ్ సింగ్, పర్మీందర్ సింగ్, జకార్ ఖాన్, సుఖ్మీత్ సింగ్లతో కూడిన భారత జట్టు పోటీని ముగించింది.
అంతకంటే అత్యుత్తమ టైమింగ్ నమోదు చేసిన చైనా జట్టు అగ్రస్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ దక్కించుకుంది. ఉజ్బెకిస్థాన్ రెండో స్థానంలో నిలిచి రజతం నెగ్గింది. అంతకుముందు మెన్స్ 4 టీమ్ ఈవెంట్లో జస్వీందర్ సింగ్, భీమ్ సింగ్, పునీత్, అనీశ్లతో కూడిన భారత జట్టు కూడా కాంస్యం గెలిచింది.
ఇక తొలి రోజైన ఆదివారం మెన్స్ 8 టీమ్ ఈవెంట్లో భారత రోయింగ్ జట్టు రజత పతకం గెలుచుకుంది. మెన్స్ పెయిర్ ఈవెంట్లో బాబులాల్ యాదవ్, లేఖ్ రామ్ జట్టు కాంస్యం సాధించింది. మెన్స్ లైట్ వెయిట్ డబుల్ స్కల్స్లో అర్జున్ జాట్లాల్, అర్వింద్ సింగ్ టీమ్ రజతం నెగ్గింది. అన్నీ కలిపి రోయింగ్లో భారత్ గెలిచిన పతకాల సంఖ్య ఐదుకు చేరింది. ఇంతటితో భారత్ పాల్గొనే రోయింగ్ పోటీలు ముగిశాయి.