హాంగ్జౌ: చైనాలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత్కు పతకాల పంట పండుతోంది. షూటింగ్, రోయింగ్, సెయిలింగ్ తదితర క్రీడాంశాల్లో భారత క్రీడాకారులు అద్భుతాలు చేశారు. దాంతో ఈ ఆసియా క్రీడల్లో భారత్ సాధించిన పతకాల సంఖ్య ఇప్పటి వరకు అర్ధ సెంచరీ దాటింది.
తాజాగా 4X400 మీటర్ల మిక్స్డ్ రిలేలో ఇండియన్ టీమ్ రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. అంతేగాక ఇవాళ స్టీపుల్ చేజ్లో భారత్కు మూడు పతకాలు వచ్చాయి. మెన్స్ 3000 మీటర్ల విభాగంలో అవినాష్ సాబిల్కు గోల్డ్, ఉమెన్స్ 3000 మీటర్ల విభాగంలో పారుల్, ప్రీతిలకు వరుసగా రజతం, కాంస్యం దక్కాయి. అంతకుముందు హెప్టాథ్లాన్లో తెలంగాణ అమ్మాయి నందిని అగసారా కాంస్యం గెలిచింది.