హాంగ్జౌ: చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్కు మరో బంగారు పతకం దక్కింది. శుక్రవారం సాయంత్రం జరిగిన మెన్స్ హాకీ ఫైనల్లో హర్మన్ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు జపాన్పై ఘన విజయం సాధించి గోల్డ్ మెడల్ నెగ్గింది. ఈ స్వర్ణంతో కలిపి ఈ ఆసియాడ్లో భారత్ ఇప్పటి వరకు సాధించిన మొత్తం గోల్డ్ మెడల్స్ సంఖ్య 22కు చేరింది.
హాకీ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఆది నుంచీ ఆదిపత్యం కనబర్చింది. చివరికి 5-1 గోల్స్ తేడాతో జపాన్ను చిత్తుచేసింది. ఈ గెలుపు ద్వారా భారత్ స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకోవడమేగా 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్ బెర్తును కూడా కన్ఫామ్ చేసుకుంది. కాగా, ఈ పతకంతో కలిపి ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు మొత్తం 4 బంగారు పతకాలు గెలిచినట్లయ్యింది.
దాంతో ఆసియాడ్లో ఇప్పటివరకు 4 గోల్డ్ మెడల్స్ గెలిచిన దక్షిణకొరియా రికార్డును భారత్ సమం చేసింది. కాగా, ఆసియాడ్లో ఇప్పటివరకు అత్యధిక స్వర్ణాలు గెలిచిన రికార్డు పాకిస్థాన్ పేరిట ఉంది. పాక్ ఆసియా క్రీడల్లో మొత్తం 9 గోల్డ్ మెడల్స్ గెలుచుకుంది.