కోల్కతా: స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రీ దుమ్మురేపడంతో తొలి మ్యాచ్లో కాంబోడియాను చిత్తు చేసిన భారత పురుషుల ఫుట్బాల్ జట్టు.. శనివారం మలి పోరులో అఫ్గానిస్థాన్తో తలపడేందుకు సిద్ధమైంది. ఆసియా ఫుట్బాల్ కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా జరుగనున్న ఈ మ్యాచ్లోనూ నెగ్గి ముందంజ వేయాలని భారత్ తహతహలాడుతున్నది. కెప్టెన్ ఛెత్రీ విన్నపం మేరకు తొలి మ్యాచ్కు భారీగా ప్రేక్షకులు తరలి రాగా.. కిక్కిరిసిన స్టేడియంలో మనవాళ్లు అద్భుత ఆటతీరు కనబరిచి టోర్నీలో బోణీ కొట్టారు. అదే జోష్లో అఫ్గానిస్థాన్పై విజయం సాధించాలని సునీల్ సేన చూస్తున్నది.