బ్యాంకాక్: ఏషియన్ ఆర్చరీ చాంపియన్షిప్లో భారత ఆర్చర్ల పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. గురువారం జరిగిన వేర్వేరు విభాగాల్లో మన ఆర్చర్లు మూడు స్వర్ణాలు, రజతం, మూడు కాంస్య పతకాలు దక్కించుకున్నారు. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో తెలుగు స్టార్ ఆర్చర్ వెన్నెం జ్యోతిసురేఖ రజత పతకం సొంతం చేసుకుంది.
ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో సురేఖ 8-9(టై బ్రేక్)తేడాతో పర్నీత్కౌర్ చేతిలో ఓటమిపాలైంది. అంతకుముందు సురేఖ, పర్నీత్ మధ్య సాగిన పోరు 145-145తో సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు టైబ్రేక్ తప్పనిసరైంది. కాం మిక్స్డ్ టీమ్ ఫైనల్లో భారత ద్వయం అదితి స్వామి, ప్రియాంశ్ 156-151తో థాయ్లాండ్ జోడీపై గెలిచి పసిడి సొంతం చేసుకుంది. జ్యోతి, పర్నీత్, అదితితో కూడిన భారత త్రయం పసడి కైవసం చేసుకోగా, అభిషేక్ వర్మ కాంస్యం దక్కించుకున్నాడు.