Asia Cup | నెలల తరబడిగా కొనసాగుతున్న ఊహాగానాలకు ముగింపు పలుకుతూ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ఆసియా కప్ షెడ్యూల్ను ప్రకటించింది. ఆరు జట్ల టోర్నీలో ఆతిథ్య పాకిస్థాన్లో నాలుగు మ్యాచ్లు, శ్రీలంకలో తొమ్మిది మ్యాచ్లు జరుగనున్నాయి. టోర్నమెంట్ ఆగస్టు 31న వన్డే ఫార్మాట్లో మొదలవున్నది. ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న జరుగనున్నది. ఇంకా పూర్తి షెడ్యూల్ను ప్రకటించాల్సి ఉంది. అయితే, ఆసియా కప్ షెడ్యూల్పై పీసీబీ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ నజామ్ సేథీ స్పందించారు. బీసీసీఐ పరిస్థితిని తాము అర్థం చేసుకున్నామని, ప్రస్తుత హైబ్రిడ్ మోడల్ బెస్ట్ ఆప్షన్ అని తెలిపారు. ఈ సమయంలో భారత జట్టు పాకిస్థాన్కు వెళ్లకపోవడంపై సేథీ విచారం వ్యక్తం చేశారు.
15 సంవత్సరాల తర్వాత భారత క్రికెట్ జట్టు పాక్లో ఆడటాన్ని అభిమానులు ఇష్టపడతారని, అయితే.. బీసీసీఐ పరిస్థితులను అర్థం చేసుకున్నామన్నారు. పాక్ క్రికెట్ బోర్డు మాదిరిగానే బీసీసీఐ సైతం సరిహద్దులు దాటాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉందన్నారు. ఇదిలా ఉండగా.. ఆసియా కప్లో ఆరు జట్లు పాల్గొననున్నాయి. మూడు జట్ల చొప్పున రెండు గ్రూప్లు విభజించారు. రెండు గ్రూప్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ ఫోర్కు అర్హత సాధిస్తాయి. నాలుగు జట్లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్లో తలపడనున్నాయి. అయితే, ఫైనల్ మ్యాచ్లో శ్రీలంకలోని క్యాండీ లేదంటే.. పల్లెకెలె స్టేడియంలో జరుగనున్నాయి. భారత్, పాకిస్థాన్, నేపాల్ ఒక గ్రూపులో ఉండగా.. శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ మరో గ్రూప్లో ఉన్నాయి.