న్యూఢిల్లీ: ఆసియా కప్ క్రికెట్ టోర్నీ(Asia Cup 2023)ని ఈ సారి హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్నారు. టోర్నీ షెడ్యూల్ను ఆసియా క్రికెట్ మండలి రిలీజ్ చేసింది. ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 17 వరకు ఆ టోర్నీ జరగనున్నది. ఇండియా, పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి. మొత్తం 13 వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. హైబ్రిడ్ మోడల్లో భాగంగా నాలుగు మ్యాచ్లను పాకిస్థాన్లో, మిగితా 9 మ్యాచ్లను శ్రీలంకలో నిర్వహించనున్నారు.
నిజానికి పాకిస్థాన్లో ఆసియా కప్ మ్యాచ్లను నిర్వహించే అంశంపై అనుమానాలు ఉండేవి. అయితే కొత్త మోడల్కు ఆమోదం దక్కడంతో.. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆసియా కప్ మ్యాచ్లు పాక్లో జరగనున్నాయి. 2023 ఆసియా కప్లో రెండు గ్రూపులు ఉండనున్నాయి. టాప్ రెండు జట్లు సూపర్ ఫోర్ స్టేజ్కు వెళ్తాయి. ఆసియా కప్ వేదికల గురించి బీసీసీఐ, పీసీబీ మధ్య వివాదం చెలరేగింది. పాక్కు తమ జట్టును పంపబోమని బీసీసీఐ ఇటీవల పేర్కొన్నది. దీంతో రంగంలోకి దిగిన ఏసీసీ కొత్త మోడల్కు ఓకే చెప్పింది.