గతేడాది పొట్టి ప్రపంచకప్లో భాగంగా పాకిస్తాన్ చేతిలో భంగపడ్డ భారత్ దానికి బదులుతీర్చుకోవాలని కొద్దికాలంగా ఎదురుచూస్తున్నది. అయితే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు లేకపోవడంతో దాయాదుల పోరు చూడటం మళ్లీ అక్టోబర్లో మొదలయ్యే టీ20 ప్రపంచకప్లోనే అనుకుంటుండగా.. మధ్యలో నేనున్నానంటూ దూసుకొచ్చింది ఆసియా కప్. నాలుగేండ్ల తర్వాత వస్తున్న ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ తాజాగా విడుదలైంది. ఈ టోర్నీలో ఇరు దేశాల అభిమానులు మళ్లీ ఇండియా-పాకిస్తాన్ మధ్య రసవత్తర పోరును ఆస్వాదించొచ్చు.
ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్న జై షా ట్విటర్ వేదికగా ఆసియా కప్-2022 షెడ్యూల్ను విడుదల చేశాడు. ఆగస్టు 27న శ్రీలంక-ఆఫ్ఘనిస్తాన్ల పోరుతో టోర్నీ ప్రారంభమవనుండగా.. భారత్-పాక్లు ఈనెల 28న తలపడతాయి.
ఈ టోర్నీలో ఆరు జట్లు పాల్గొంటున్నాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లు ఈ టోర్నీకి నేరుగా అర్హత సాధించాయి. ఆరో జట్టు కోసం యూఏఈ, హాంకాంగ్, కువైట్, సింగపూర్ పోటీపడనున్నాయి. టోర్నీ ప్రారంభానికి ముందే క్వాలిఫైయర్ మ్యాచ్ల ద్వారా ఆరోజట్టును నిర్ణయిస్తారు.
టీ20 ఫార్మాట్లో ఆడనున్న ఈ టోర్నీలో గ్రూప్-ఏ లో భారత్, పాకిస్తాన్తో పాటు క్వాలిఫైయర్ (?) జట్టు ఉంది. గ్రూప్-బిలో శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లు ఉన్నాయి. శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం కారణంగా యూఏఈకి తరలిన ఈ టోర్నీలో మూడు మ్యాచ్లు షార్జాలో జరుగుతుండగా.. మిగిలిన మ్యాచ్లన్నీ దుబాయ్ వేదికగానే నిర్వహించనున్నారు.
The wait is finally over as the battle for Asian supremacy commences on 27th August with the all-important final on 11th September.
The 15th edition of the Asia Cup will serve as ideal preparation ahead of the ICC T20 World Cup. pic.twitter.com/QfTskWX6RD
— Jay Shah (@JayShah) August 2, 2022