ఆసియా కప్లో భారత హాకీ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో జపాన్ను ఓడించింది. జకార్తాలో జరుగుతున్న సూపర్ ఫోర్ మ్యాచ్లో జపాన్పై విజయం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో మన్జీత్ సింగ్.. భారత జట్టుకు మంచి ఆరంభం అందించాడు. మ్యాచ్ మొదలైన ఏడో నిమిషంలోనే అద్భుతమైన గోల్ చేశాడు.
అయితే చాలా డామినెంట్గా ఆడిన జపాన్ జట్టు.. బంతిని తమ వద్దే ఎక్కువ సేపు ఉంచుకుంది. నాలుగు పెనాల్టీ షూట్లు కూడా సాధించింది. ఈ క్రమంలోనే హాఫ్ టైం వద్ద పెనాల్టీ షూట్ రీబౌండ్ను గోల్గా మలిచిన జపాన్ ఆటగాడు టకుమా నివా.. స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత కూడా జపాన్ జట్టు ధాటిగా ఆడింది.
అయితే భారత జట్టు కూడా పట్టుదల ప్రదర్శించడంతో ఎవరూ గోల్ చేయలేకపోయారు. ఇలాంటి సమయంలో పవన్ రాజ్భర్ సూపర్ గోల్ చేయడంతో జట్టులో ఆత్మవిశ్వాసం నిండింది. ఆ లీడ్ కోల్పోకుండానే భారత జట్టు ఈ మ్యాచ్ ముగించింది. దాంతో మూడు పాయింట్లు సాధించిన టీమిండియా.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది.