ఈ ఐపీఎల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన వెటరన్ ఆటగాళ్లలో రవిచంద్రన్ అశ్విన్ ఒకడు. తన పని అయిపోయిందని ఎవరు అనుకున్నా సరే వాళ్లను తప్పు అని అశ్విన్ నిరూపిస్తూనే ఉన్నాడని భారత మాజీ దిగ్గజం వసీమ్ జాఫర్ అన్నాడు. ఈ ఏడాది ఐపీఎల్లో రాజస్థాన్ తరఫున అతను అద్భుతంగా రాణించాడని కొనియాడాడు. అతనికి జట్టులో ఎలాంటి పాత్ర ఇచ్చినా న్యాయం చేశాడని మెచ్చుకున్నాడు.
‘‘ఎలాంటి పాత్రలో అతన్ని దింపినా సరే.. అద్భుతంగా ఆ పాత్ర పోషించాడు’’ అని అశ్విన్పై ప్రశంసలు కురింపించాడు. ఐపీఎల్లో 146పైగా సగటుతో బ్యాటింగ్ చేసిన అశ్విన్.. 11 వికెట్లు కూడా తీసుకున్నాడు. పిచ్ కఠినంగా ఉన్న మ్యాచ్లో మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అర్ధశతకం కూడా చేశాడు. అంతేకాదు, ధాటిగా ఆడుతూ తనలోని బ్యాటర్ను అందరికీ మరోసారి గుర్తుచేశాడు.