లండన్: ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్లో తొలి టెస్టు ఓడిన ఇంగ్లండ్.. రెండో మ్యాచ్లో పుంజుకునేందుకు సిద్ధమైంది. బజ్బాల్ మోజులో తొలి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్యర్యపరిచిన ఇంగ్లిష్ టీమ్.. లార్డ్స్లో బుధవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్లో ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగనుంది. జోష్ టంగ్ ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు.
స్టార్ స్పిన్నర్ మోయిన్ అలీ గాయపడటంతో పాటు.. పిచ్ పేస్కు సహకరించనున్న నేపథ్యంలో స్టోక్స్ బృందం ఈ నిర్ణయానికి వచ్చింది. మ్యాచ్కు ముందు రోజే ఇంగ్లండ్ తుది జట్టును ప్రకటించింది. ఇక మరోవైపు తొలి మ్యాచ్ నెగ్గి ఫుల్ జోష్లో ఉన్న ఆస్ట్రేలియా అదే జోరు కొనసాగించాలని చూస్తున్నది. ఉస్మాన్ ఖవాజా ఫుల్ ఫామ్లో ఉండగా.. స్మిత్, వార్నర్, లబుషేన్, గ్రీన్, హెడ్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది.