హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక టోర్నీ ఐలీగ్లో భాగంగా సొంతగడ్డపై జరిగిన తొలి మ్యాచ్లో శ్రీనిధి దెక్కన్ ఎఫ్సీ అదరగొట్టింది. కొత్తగా ప్రారంభించిన దెక్కన్ ఎరీనాలో గురువారం జరిగిన మ్యాచ్లో శ్రీనిధి 1-0 తేడాతో టీఆర్ఏయూ ఎఫ్సీపై విజయం సాధించింది. మ్యాచ్లో ఆది నుంచి తమదైన జోరు కనబరిచిన శ్రీనిధి తరఫున డేవిడ్ కాస్టెండా మునోజ్(41ని) ఏకైక గోల్ చేశాడు. ప్రత్యర్థి డిఫెన్స్ను చేధిస్తూ మ్యాచ్ 41వ నిమిషంలో డేవిడ్ చేసిన గోల్తో శ్రీనిధి ఖాతా తెరిచింది. తొలి రౌండ్లో ఓటమి తర్వాత శ్రీనిధికి ఇది వరుసగా రెండో విజయం కాగా, ఈ సీజన్లో టీఆర్ఏయూకు ఇది తొలి ఓటమి.