ఐజిల్ ఆఫ్ మాన్ : ఫిడే గ్రాండ్ స్విస్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్మాస్టర్ విదిత్ గుజరాతి ఏడో రౌండ్లో అద్భుత విజయంతో ఆధిక్యంలోకి దూసుకుపోయాడు. ఉజ్బెకిస్థాన్కు చెందిన జవొఖిర్ సిందరొవ్పై 57 ఎత్తులలో విజయం సాధించిన విదిత్ 5.5 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ప్రపంచ చాంపియన్షిప్ క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించే దిశగా విదిత్ అడుగులు వేస్తున్నాడు.
కాగా తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేసి 5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఏడో రౌండ్లో ఇతర భారత గ్రాండ్మాస్టర్లు ప్రజ్ఞానంద, అర్జున్, నిహాల్ సరిన్, హరికృష్ణ, ఆర్యన్ చోప్రా, గుకేష్ విజయాలు నమోదు చేసుకోగా, నారాయణన్, అరవింద్ చిదంబరం, రౌనక్ సాధ్వాని, మురళి కార్తికేయన్, అధిబన్ ఓటమిపాలయ్యారు. మహిళా విభాగంలో ఆర్.వైశాలి కజకస్థాన్కు చెందిన అసబయేవపై గెలుపొంది 5.5 పాయింట్లతో మరో ఇద్దరితో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నది.