నదియాద్: ప్రపంచ అథ్లెటిక్స్ అండర్-20 టోర్నీకి భారత అథ్లెట్లు అర్జున్ వాస్కలే, ప్రియాంక సిరక్వార్ ఎంపికయ్యారు. గుజరాత్లో గురువారం నిర్వహించిన జాతీయ జూనియర్ చాంపియన్షిప్లో విజేతలుగా నిలిచిన వీరు ప్రతిష్ఠాత్మక టోర్నీకి అర్హత సాధించారు. అమ్మాయిల 100 మీటర్ల విభాగంలో ప్రియాంక 11.80 సెకండ్లలో లక్ష్యం చేరి చాంపియన్గా నిలిచింది. పురుషుల 1500 మీటర్ల విభాగంలో అర్జున్ రెండు అద్భుతమైన ఫీట్లు సాధించాడు. 3:46:31 సెకండ్లలో లక్ష్యం పూర్తి చేసి మెగాటోర్నీలో స్థానం దక్కించుకోవడంతోపాటు సునీల్ దవార్ రికార్డును తుడిచేశాడు. 5000 మీటర్ల రేసులో గగన్ సింగ్ 14:44.25 సెకండ్లలో పూర్తి చేసి స్వర్ణం చేజిక్కించుకున్నాడు.