హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడాటోర్నీలో జాతీయ హ్యాండ్బాల్ సంఘం అధ్యక్షుడు జగన్మోహన్రావుకు కీలక బాధ్యతలు అప్పగించారు. పోటీల నిర్వహణపై క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో జగన్ను ప్రారంభోత్సవ కమిటీ చైర్మన్గా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీల ప్రారంభ ఏర్పాట్లు, టోర్నీలో పాల్గొనే ప్లేయర్లకు అవసరమైన వసతి, భోజన, రవాణా సదుపాయాల బాధ్యతలను కేటాయించారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన మంత్రి శ్రీనివాస్గౌడ్, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాకు జగన్ కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాకారుల అభివృద్ది కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ను విజయవంతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని జగన్మోహన్రావు పేర్కొన్నారు.