బంజారాహిల్స్: అవయవదానంపై మరింత అవగాహన కల్పించేందుకు తెలంగాణ జీవన్దాన్, సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ ముందుకొచ్చాయి. ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడుతున్న అనేక మంది రోగులకు కొత్త జీవితాన్ని అందించేందుకు అవయవదానంపై జీవన్దాన్, సన్రైజర్స్తో కలిసి ఈ కార్యక్రమం చేపట్టామని అపోలో హాస్పిటల్ పేర్కొంది.
మంగళవారం జూబ్లిహిల్స్ దవాఖానలో నిర్వహించిన ‘రైజ్ ఎగైన్’ కార్యక్రమంలో రైజర్స్ జట్టు సభ్యులు మురళీధరన్, స్టెయిన్, ఉమ్రాన్ మాలిక్, క్లాసెన్తో పాటు జీవన్దాన్ సీఈవో డా. స్వర్ణలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అపోలో దవాఖానలో అవయవ మార్పిడి కార్యక్రమాన్ని 1990 లో ప్రారంభించి ఇప్పటివరకు 4872 అవయవ మార్పిడిలు విజయవంతంగా చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అపోలో వైద్యులు డా. నరేష్ కుమార్, డా. సుబ్రహ్మణ్యం, డా. అనంద్ రామమూర్తి, డా. శశిధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.