Virushka | మరికొన్ని గంటల్లో 2022 సంవత్సరం కాలగర్భంలో కలిసిపోబోతోంది. ప్రపంచమంతా కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా కొత్త ఏడాదికి సరికొత్తగా స్వాగతం పలికేందుకు బాలీవుడ్ మోస్ట్ రొమాంటిక్ కపుల్స్ అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ జంట ఇటీవల తమకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్లారు.
ఈ ఏడాదిలో చివరిసారిగా వారు దుబాయ్ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ సూర్యోదయం సమయంలో దిగిన ఓ ఫొటోను కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. ‘2022 సంవత్సరంలో ఇదే ఆఖరి సూర్యోదయం’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.