పారిస్: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-3లో భారత ఆర్చర్లు సత్తాచాటారు. తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ ఇప్పటికే రెండు మెడల్స్ (రికర్వ్ వ్యక్తిగత విభాగంలో రజతం, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం) సాధించగా.. ఆదివారం మహిళల టీమ్ ఈవెంట్లో దీపిక కుమారి, అంకిత, సిమ్రన్జీత్ కౌర్ త్రయం.. రజత పతకం కైవసం చేసుకుంది. తుదిపోరులో దీపిక, అంకిత, సిమ్రన్జీత్ బృందం 1-5తో చైనా త్రయం చేతిలో పరాజయం పాలై రెండో స్థానానికి పరిమితమైంది. దీంతో భారత ఆర్చర్లు మూడు పతకాల (ఒక స్వర్ణం, 2 రజతాలు)తో ఈ మెగాటోర్నీని ముగించారు.