అస్తానా: భారత యువ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అన్మోల్ ఖర్బ్ కజకిస్థాన్ రాజధాని అస్తానా వేదికగా జరుగుతున్న కజకిస్థాన్ ఇంటర్నేషనల్ చాలెంజ్లో ప్రిక్వార్టర్స్కు చేరుకుంది. బుధవారం ముగిసిన సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్లో అన్మోల్ 21-13, 21-19 తేడాతో భారత్కే చెందిన మాళవిక బన్సోద్ను ఓడించింది.
ఇటీవలే చైనా వేదికగా ముగిసిన ఆసియా టీమ్ చాంపియన్షిప్స్లో స్వర్ణం నెగ్గిన జట్టులో సభ్యురాలిగా ఉన్న ఆమె జోరు కొనసాగించింది. ప్రిక్వార్టర్స్లో అన్మోల్.. ఇండోనేషియాకు చెందిన నురానితో తలపడనుంది. మరో పోరులో అనుపమ ఉపాధ్యాయ 21-13, 21-13 తేడాతో హర్షితను ఓడించింది. మిక్స్డ్ డబుల్స్లో భారత ఆటగాళ్లు రోహన్ కపూర్-గద్దె రిత్విక శివానీ, సంజయ్ శ్రీవాత్సవ- మనీష, అభ్యుధయ్ చౌదరీ- వైష్ణవి, ఝకువొ సెయి-అలిషా ఖాన్, అయుష్ రాజ్- శృతి జోడీ ప్రిక్వార్టర్స్కు అర్హత సాధించాయి.