న్యూఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో భారత్కు మరో పతకం దక్కింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో భారత షూటర్ అంజుమ్ మౌద్గిల్ రజతం కొల్లగొట్టింది. దీంతో ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒక స్వర్ణం, మూడు రజతాలు సాధించిన భారత్.. పతకాల పట్టికలో మూడో స్థానానికి చేరింది. బాకు వేదికగా శుక్రవారం జరిగిన స్వర్ణ పతక పోరులో అంజుమ్ 12-16తో రిక్కే మైంగ్ ఇబ్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకుంది. ప్రపంచకప్లో అంజుమ్కు ఇది రెండో వ్యక్తిగత రజతం కాగా.. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్లో 600కు గాను 587 పాయింట్లు స్కోర్ చేసి ర్యాంకింగ్ రౌండ్కు అర్హత సాధించింది.