మారేడ్పల్లి: దక్కన్ క్లబ్లో రాష్ట్ర స్థాయి ఎలైట్ చెస్ టోర్నీకి శనివారం తెరలేచింది. సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, డీజీపీ అంజనీకుమార్ ముఖ్య అతిథులుగా హాజరై టోర్నీని లాంఛనంగా ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరుగనున్న చాంపియన్షిప్లో 90 మంది ప్లేయర్లు పోటీపడుతున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈసందర్భంగా సాట్స్ చైర్మన్ మాట్లాడుతూ ‘గత దశాబ్ద కాలం నుంచి సీఎం కేసీఆర్ నాయకత్వంలో క్రీడాభివృద్ధిని కొనసాగిస్తున్నాం. ప్రతిభ కల్గిన యువ ప్లేయర్లను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో చెస్ సంఘం అధ్యక్షుడు ప్రసాద్, దక్కన్ క్లబ్ అధ్యక్షుడు అనిల్కుమార్, కార్యదర్శి శ్యామ్ పాల్గొన్నారు.