న్యూఢిల్లీ : కొరియాలో జరుగుతున్న ఆసియన్ షూటింగ్ చాంపియన్షిప్లో అనీష్ భన్వాలా కాంస్య పతకం గెలుచుకున్నాడు. పురుషుల 25మీ. పిస్టల్ ఫైర్ విభాగం ఫైనల్లో 21 ఏళ్ల అనీష్ షూటౌట్లో జపాన్కు చెందిన దయ్ యొషివోక చేతిలో ఓడి కాంస్యానికి పరిమితమయ్యాడు.
ఈ ప్రదర్శనతో అనీష్ వచ్చే యేడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ బెర్త్ను దక్కించుకున్నాడు. కాగా కొరియాకు చెందిన లీ గన్మ్యోక స్వర్ణం సొంతం చేసుకున్నాడు. పురుషుల ట్రాప్ విభాగంలో జొరావర్ సింగ్, కైనన్ షెనాయ్, పృధ్వీరాజ్ తొండైమన్లతో కూడిన భారత జట్టు కేవలం మూడు పాయింట్ల తేడాతో రజత పతకానికి పరిమితమైంది.