Vamshhi Krrishna : దేశవాళీ టోర్నీలో ఆంధ్రా క్రికెటర్ వంశీ కృష్ణ(Vamshhi Krrishna) సంచలనం సృష్టించాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి అరుదైన క్లబ్టో చేరిపోయాడు. దేశవాళీ టోర్నీ అయిన కల్నల్ సీకే నాయుడు (Colnel CK Naidu) ట్రోఫీలో భాగంగా రైల్వేస్ జట్టుపై వంశీ ఈ ఫీట్ సాధించాడు. తద్వారా రవి శాస్త్రి(Ravi Shastri), మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh), రుత్రాజ్ గైక్వాడ్ (Rutraj Gaikwad)ల తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో భారత క్రికెటర్గా వంశీ రికార్డు నెలకొల్పాడు.
స్పిన్నర్ దమన్దీప్ సింగ్ ఓవర్లో రెచ్చిపోయిన ఈ రైట్హ్యాండర్ ఏకంగా ఆరు బంతుల్ని స్టాండ్స్లోకి పంపాడు. మొదటి బంతిని స్వీప్ షాట్తో సిక్సర్గా మలిచిన వంశీ.. రంఎడో బంతిని బౌలర్ తల మీదుగా స్టాండ్స్లోకి తరలించాడు.
𝟔 𝐒𝐈𝐗𝐄𝐒 𝐢𝐧 𝐚𝐧 𝐨𝐯𝐞𝐫 𝐀𝐥𝐞𝐫𝐭! 🚨
Vamshhi Krrishna of Andhra hit 6 sixes in an over off Railways spinner Damandeep Singh on his way to a blistering 64-ball 110 in the Col C K Nayudu Trophy in Kadapa.
Relive 📽️ those monstrous hits 🔽@IDFCFIRSTBank | #CKNayudu pic.twitter.com/MTlQWqUuKP
— BCCI Domestic (@BCCIdomestic) February 21, 2024
మూడో బంతిని మిడ్వికెట్ మీదుగా స్టాండ్స్లో పడింది. నాలుగో బంతిని సిక్సర్గా బాదిన వంశీ ఐదో బంతిని డీప్ స్క్వేర్ దిశగా స్టాండ్స్లోకి పంపాడు. ఇక ఆఖరి బంతిని బ్యాక్ఫుట్లో ఆడి మిడ్ వికెట్ మీదుగా సిక్సర్గా మలిచాడు. ఈ మ్యాచ్లో వంశీ 64 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్సర్లతో 110 రన్స్ కొట్టాడు. దాంతో, ఆంధ్రా 378 రన్స్ చేయగలిగింది.
ఒకే ఓవర్లో ఆరు సిక్సర్ల రికార్డు రవి శాస్త్రితో మొదలైంది. 1985లో రంజీ మ్యాచ్లో రవిశాస్త్రి ఆరు సిక్సర్లతో సంచలనం సృష్టించాడు. బరోడా పార్ట్ టైమ్ స్పిన్నర్ తిలక్ రాజ్(Tilak Raj) వేసిన ఓవర్లో ఆరు బంతుల్ని స్టాండ్స్లోకి పంపి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
రవి శాస్త్రి, యువరాజ్ సింగ్
యువరాజ్ సింగ్ 2007 టీ 20 వరల్డ్ కప్లో .. ఇంగ్లండ్ పేసర్ స్టువార్ట్ బ్రాడ్ ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు. 2022 విజయ్ హజారే ట్రోఫీలో రుతురాజ్ గైక్వాడ్ ఒకే ఓవర్లో ఏకంగా ఏడు సిక్సర్లు బాది వార్తల్లో నిలిచాడు. అతడి వీరబాదుడుకు ఉత్తర ప్రదేశ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శివ సింగ్ 43 పరుగులు సమర్పించుకున్నాడు.