హైదరాబాద్, ఆట ప్రతినిధి: చెన్నై వేదికగా జరిగిన సౌత్జోన్ గోల్ఫ్ చాంపియన్షిప్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు అమూల్య, మధు అదరగొట్టారు. టోర్నీ ఆద్యంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన అమూల్య కేటగిరీ-ఏలో పసిడి పతకం దక్కించుకోగా, కేటగిరీ-బిలో మధు రజతం సొంతం చేసుకున్నాడు.
ప్రత్యర్థి గోల్ఫర్లకు దీటైన పోటీనిస్తూ ముందుకు సాగిన అమూల్య, మధు తమదైన రీతిలో సత్తాచాటారు. వీరిని మంత్రి కొప్పుల ఈశ్వర్, గురుకులాల కార్యదర్శి నవీన్ నికోలస్ ప్రత్యేకంగా అభినందించారు.