ముంబై: దేశవాళీ దిగ్గజ ఆటగాడు అమోల్ మజుమ్దార్ భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్కోచ్గా నియమితుడయ్యాడు. సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపేతో కూడిన క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏసీ) ఏకగ్రీవంగా మజుమ్దార్కు మద్దతు తెలిపింది. దీంతో బుధవారం బీసీసీఐ కొత్త కోచ్ను ప్రకటించింది. రంజీల్లో రెండు దశాబ్దాలకు పైగా ముంబైకి ప్రాతినిధ్యం వహించిన మజుమ్దార్ మహిళల క్రికెట్ జట్టును పటిష్టంగా తీర్చి దిద్దుతారనే నమ్మకముందని బోర్డు కార్యదర్శి జై షా ఆకాంక్షించాడు.