వింబుల్డన్: సీజన్ మూడో గ్రాండ్స్లామ్ టోర్నీ వింబుల్డన్లో అమెరికా టెన్నిస్ స్టార్ జెస్సిక పెగులా క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం మహిళల సింగిల్స ప్రిక్వార్టర్స్లో నాలుగో సీడ్ పెగులా 6-1, 6-3తో లెసియా సురెంకోపై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిపత్యం కనబర్చిన పెగులా.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస సెట్లలో విజయం సాధించింది. మరో మ్యాచ్లో వోండ్రొసోవా 2-6, 6-4, 6-3తో బొజుకోవాపై గెలిచి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది.
పురుషుల సింగిల్స్లో రూబ్లేవ్, సిన్నెర్ క్వార్టర్స్కు చేరారు. హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్స్ పోరులో రూబ్లేవ్ 7-6, 6-3, 6-7 (6/8), 6-7 (5/7), 6-4తో బబ్లిక్పై నెగ్గాడు. పురుషుల డబుల్స్లో భారత ఆటగాళ్లు యూకీ బాంబ్రీ-సాకేత్ మైనేని తొలి రౌండ్లోనే పరాజయం పాలయ్యారు. మరోవైపు వింబుల్డన్ జూనియర్ టోర్నీలో భారత ఆటగాడు మానస్ రెండోరౌండ్కు ప్రవేశించాడు. తొలి రౌండ్లో 16 ఏండ్ల మానస్ 6-2, 6-4తో హెడెన్ జోన్స్పై గెలుపొందాడు.