న్యూఢిల్లీ: అత్యంత ఆసక్తి రేపుతున్న ఐపీఎల్ ప్రసార హక్కుల పోటీ నుంచి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తప్పుకొంది. దీంతో ఈనెల 12, 13 తేదీల్లో జరిగే ఐపీఎల్ ప్రసార హక్కుల వేలంలో స్టార్, వయాకామ్, సోనీ, జీ వ్యాపార సంస్థలు పోటీపడనున్నాయి. 2023-27 ఐదేండ్ల కాలం కోసం బీసీసీఐ బిడ్లను ఆహ్వానించింది. ప్రసార హక్కులను మొత్తం 4 ప్యాకేజీలుగా విభజించారు. టెలివిజన్తో పాటు ఆన్లైన్ స్ట్రీమింగ్ హక్కులకోసం పది కంపెనీలు పోటీపడుతున్నాయని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.