Team India | సిల్హెట్: బంగ్లాదేశ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత మహిళల క్రికెట్ జట్టు క్లీన్స్వీప్ చేసింది. గురువారం సిల్హెట్ వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్లో హర్మన్ప్రీత్ సేన 21 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. స్వల్ప ఛేదనలో బంగ్లా.. 20 ఓవర్లలో 135/6కే పరిమితమైంది. స్పిన్నర్ రాధా యాదవ్ (3/24) ఆతిథ్య జట్టును కట్టడి చేసింది. సిరీస్ ఆద్యంతం రాణించిన రాధకే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు వరించాయి.