టోక్యో సెల్ఫీ పాయింట్ ఆవిష్కరించిన జగన్మోహన్రావు
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనే అథ్లెట్ల వెంట భారతీయులంతా అండగా ఉన్నారని జాతీయ హ్యాండ్బాల్ ఫెడరేషన్ (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్రావు అన్నారు. కేంద్ర క్రీడా శాఖ, భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) పిలుపు మేరకు గచ్చిబౌలి స్టేడియంలో శనివారం టోక్యో ఒలింపిక్స్ సెల్ఫీ పాయింట్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ విశ్వక్రీడల్లో బరిలోకి దిగుతున్న తెలుగు ప్లేయర్లు సింధు, సాయి ప్రణీత్, సాత్విక్కు శుభాకాంక్షలు తెలిపారు. బజరంగ్ పునియా, అతాను దాస్, దీపికా కుమారి, మనుభాకర్, నీరజ్ చోప్రా, ద్యుతీచంద్, మీరాబాయి అంచనాలకు తగ్గట్లు పతకాలు నెగ్గే అవకాశాలు ఉన్నాయని అన్నారు. టోక్యో వెళ్లే ప్లేయర్లకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా కేంద్ర క్రీడాశాఖ, సాయ్, ఐవోఏ అన్ని చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాట్స్ కోచ్లు నందగోకుల్, సుధాకర్, చారి పాల్గొన్నారు.