హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): కర్ణాటక వేదికగా జరిగిన ఆల్ఇండియా సబ్జూనియర్ జాతీయ బాక్సింగ్ టోర్నీలో రాష్ర్టానికి చెందిన అనుముల సాయిభార్గవ్రెడ్డి కాంస్య పతకంతో మెరిశాడు. బాలుర 46-49కిలోల విభాగం సెమీస్లో బరిలోకి దిగిన సాయి ప్రత్యర్థి చేతిలో ఓటమి ఎదుర్కోవడంతో కాంస్య పతకానికి పరిమితమయ్యాడు.
ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్లో ప్రస్తుతం శిక్షణ పొందుతున్న సాయి ప్రదర్శన పట్ల యాజమాన్యంతో పాటు స్థానికులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా త్రిపురారం మండల కేంద్రానికి చెందిన సాయి భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.