హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆల్ఇండియా సబ్జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీ ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు జరుగనుంది. ఈ విషయాన్ని రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి కారెడ్ల శ్రీనివాస్రావు, సంయుక్త కార్యదర్శి యూవీఎన్ బాబు పేర్కొన్నారు. గచ్చిబౌలి గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో టోర్నీకి ఏర్పా ట్లు చేసినట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న ప్లేయర్లు రిజిస్ట్రేషన్ కోసం ఈ నంబర్ (98480 15443) సంప్రదించవచ్చని స్పష్టం చేశారు.