నేరేడ్మెట్, జూన్: ఆల్ఇండియా సబ్జూనియర్ ర్యాం కింగ్స్ బ్యా డ్మింటన్ టోర్నీలో గిరివాసన్, శశాంక్ విజేతలుగా నిలిచారు. చేతన్ ఆనంద్ అకాడమీలో జరిగిన అండర్-13 ర్యాంకింగ్స్ టోర్నీ శనివారం ముగిసింది. బాలుర డబుల్స్ ఫైనల్లో గోపీచంద్ అకాడమీకి చెందిన గిరివాసన్, శశాంక్ జోడీ 21-12, 16-21, 21-18తో అస్సాం ద్వయం బోర్నిల్, సుమిత్పై గెలిచిం ది. టైటిల్ విజేతలను కోచ్ రాజేందర్ అభినందించారు.