హైదరాబాద్, ఆట ప్రతినిధి: జమ్ము వేదికగా ఇటీవల జరిగిన జాతీయ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో విజేతగా నిలిచిన యువ ప్లేయర్ ఆకుల శ్రీజకు సముచిత రీతిలో సన్మానం జరిగింది. ఆనంద్నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో గురువారం శ్రీజను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీజ మాట్లాడుతూ ‘నేను ఈ స్థాయికి ఎదగడానికి రాష్ట్ర టీటీ అసోసియేషన్, కోచ్ సోమ్నాథ్ మద్దతు కారణం.
చాలా కష్టపడటం వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో టైటిళ్లు సాధించడం వెనుక తల్లిదండ్రులు, సోదరి చేసిన త్యాగాలు వెలకట్టలేనివి’ అని అంది. ఈ కార్యక్రమంలో టీఎస్టీటీఏ అధ్యక్షురాలు మహేశ్వరి, ట్రిపుల్ ఒలింపియన్ ముకేశ్కుమార్, బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.