బ్రిడ్జ్టౌన్: ఇంగ్లండ్తో జరిగిన రెండవ టీ20 మ్యాచ్లో వెస్టిండీస్ ఒక్క రన్ తేడాతో ఓడిపోయింది. 172 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన విండీస్ 15.1 ఓవర్లలో 95 రన్స్ చేసి 8 వికెట్లు కోల్పోయింది. కెన్సింగ్టన్ ఓవల్ పిచ్పై లోయర్ ఆర్డర్ బ్యాటర్ అకీల్ హుస్సేన్ ఓ అద్భుతం సృష్టించాడు. వెస్టిండీస్ను అనూహ్య రీతిలో దాదాపు విజయ తీరాలకు తీసుకెళ్లాడు. చివరి ఓవర్లో 6 బంతుల్లో 30 రన్స్ చేయాల్సి ఉండగా.. అకీల్ హుస్సేన్ హ్యాట్రిక్ సిక్సర్లతో చెలరేగాడు. సాకిబ్ మొహమూద్ వేసిన ఓవర్లో తొలుత ఓ వైడ్ వచ్చింది. ఆ తర్వాత రెండు బౌండరీలు కొట్టాడు. ఆ తర్వాత మళ్లీ వైడ్స్ వచ్చింది. ఇక చివరి మూడు బంతుల్లో 20 రన్స్ చేయడాల్సి ఉండగా.. అకీల్ హుస్సేన్ హ్యాట్రిక్ సిక్సర్లతో హోరెత్తించాడు. కేవలం ఒకే ఒక్క పరుగులతో విండీస్ ఓడిపోయింది. ఆఖరి ఓవర్లో అకీల్ హుస్సేన్ 28 రన్స్ చేసి ఇంగ్లండ్ జట్టుకు టెన్షన్ పుట్టించాడు. దానికి సంబంధించిన వీడియో ఇదే.