బెంగళూరు: చైనా వేదికగా జరిగే ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్ కోసం హాకీ ఇండియా భారత పురుషుల, మహిళల హాకీ జట్లను గురువారం ఎంపిక చేసింది. వెటరన్ ైస్ట్రెకర్ ఆకాశ్దీప్సింగ్తో పాటు యువ ప్లేయర్ కార్తీ సెల్వం, జుగ్రాజ్సింగ్ను పక్కకు పెట్టిన సెలెక్టర్లు లలిత్ ఉపాధ్యాయ్కు మళ్లీ అవకాశమిచ్చారు.
డ్రాగ్ఫ్లికర్ హర్మన్ప్రీత్సింగ్, మిడ్ఫీల్డర్ హార్దిక్సింగ్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. పీఆర్ శ్రీజేష్, క్రిషన్ బహదూర్ గోల్కీపర్లుగా వ్యవహరించనున్నారు. మరోవైపు మహిళల హాకీ జట్టుకు సవితా పునియా నాయకత్వం వహించనుంది. గురువారం ఇరు జట్లకు వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.