న్యూఢిల్లీ : ఆసియన్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత షూటర్ల హవా కొనసాగుతున్నది. బుధవారం జరిగిన పురుషుల 50మీ. రైఫిల్3 పొజిషన్ విభాగంలో ఐశ్వరి స్వర్ణం సాధించాడు. ఫైనల్లో తోమర్ 463.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే తెలంగాణ యువ షూటర్ ధనుశ్ శ్రీకాంత్కు తీవ్ర నిరాశ ఎదురైంది.
10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో పోటీకి దిగిన ధనుశ్ వేసుకున్న జాకెట్ నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో అనర్హత వేటు వేస్తున్నట్లు రిఫరీలు ప్రకటించారు. దీంతో పతకం గెలిచే అవకాశాన్ని కోల్పోయాడు.