హైదరాబాద్, ఆట ప్రతినిధి: శ్రీనిధి దక్కన్ ఫుట్బాల్ క్లబ్(ఎస్డీఎఫ్సీ)లో ప్లేయర్ల ఎరీనాను అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య(ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు కల్యాణ్ చౌబే శనివారం ప్రారంభించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన పిచ్ను, సౌకర్యాలను ఈ సందర్భంగా చౌబే అభినందించారు.
హైదరాబాద్లో ఇలాంటి అత్యుత్తమ సౌకర్యాలతో భవిష్యత్లో మరింత మంది ప్లేయర్లు వెలుగులోకి వచ్చే అవకాశముందని ఆయన అన్నారు. ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి అలీ రఫత్, కార్యదర్శి ఫాల్గుణ, ఏఐఎఫ్ఎఫ్ సలహాదారు కమిటీ చైర్మన్ షబ్బీర్ అలీ, శ్రీనిధి సీఈవో అభిజిత్రావు, ఎస్డీఎఫ్సీ ఈడీ విక్రమ్రావు, టెక్నికల్ డైరెక్టర్ ఫాబియో పెరీరియా పాల్గొన్నారు.