పొచెఫ్స్ట్రూమ్(దక్షిణాఫ్రికా): ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్లో దక్షిణాఫ్రికా ఎట్టకేలకు బోణీ కొట్టింది. మంగళవారం అర్ధరాత్రి(భారత కాలమానం ప్రకారం) జరిగిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా 111 పరుగుల తేడాతో ఆసీస్పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 338/6 పరుగులు చేసింది.
ఎడెన్ మార్క్మ్ (102 నాటౌట్) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. మిడిలార్డర్లో బ్యాటింగ్కు వచ్చిన మార్క్మ్.్ర.ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ కీలక పరుగులు జోడించాడు. లక్ష్యఛేదనకు దిగిన ఆసీస్ కొట్జె (4/50) ధాటికి 34.3 ఓవర్లలో 227 పరుగులకు కుప్పకూలింది.