హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ ఫుట్బాల్ దిగ్గజం అహ్మద్ హుస్సేన్ (89) కరోనా వైరస్తో కన్నుమూశారు. ఫుట్బాల్కు స్వర్ణ యుగంగా పేరొందిన 1950వ దశకంలో హుస్సేన్..భారత చిరస్మరణీయ విజయాల్లో కీలకమయ్యారు. ఆసియా గేమ్స్ (1951)లో స్వర్ణంతో పాటు 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్, ఆసియా క్రీడల్లో (1958) భారత్ తరఫున బరిలోకి దిగారు. ‘ద గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా’గా పేరొందిన హైదరాబాదీ హుస్సేన్ డిఫెండర్గా జట్టులో కీలక పాత్ర పోషించారు.