Ayodhya Ram Temple: దేశమంతా అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ట కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని వేచి చూస్తున్నది. సోమవారం (జనవరి 22న) అయోధ్యలో రాముడి ఆలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ కేశవ్ మహారాజ్ సౌతాఫ్రికాలో ఉన్న భారతీయులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశాడు. అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో శాంతి, సామరస్యం వెల్లివిరియాలని అతడు ప్రార్థించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను అతడు తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశాడు.
భారత సంతతి క్రికెటర్ అయిన మహారాజ్, ట్విటర్లో షేర్ చేసిన వీడియోలో మాట్లాడుతూ… ‘అందరికీ నమస్తే.. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా సౌతాఫ్రికాలో ఉంటున్న భారతీయులకు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా శాంతి, సామరస్యం వెల్లివిరియాలి. జై శ్రీరామ్.. ’ అని చెప్పుకొచ్చాడు. రామమందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో ఈ వీడియో నెట్టింట వైలర్ అవుతోంది.
Keshav Maharaj wishes everyone ahead of the Pran Pratishtha of Lord Rama in Ram Temple. pic.twitter.com/zU00hr7DgJ
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 21, 2024
అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి పలువురు భారత క్రికెటర్లకూ ఆహ్వానాలు అందాయి. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, రవీంద్ర జడేజాలకు ఆహ్వానాలు అందాయి.
Cricketers invited for Ram Temple Pran Pratishtha at Ayodhya. [PTI]
Sachin Tendulkar, Dhoni, Kohli, Rohit Sharma, Gavaskar, Kapil Dev, Dravid, Sehwag, Ganguly, Kumble, Jadeja. pic.twitter.com/Aaolg8MBoc
— Johns. (@CricCrazyJohns) January 20, 2024