Mumbai Indians: ముంబై ఇండియన్స్ సారథిగా రోహిత్ శర్మను తప్పించి హార్ధిక్ పాండ్యాను నియమించిన వెంటనే ఆ జట్టుపై హిట్మ్యాన్ అభిమానుల ఆగ్రహానికి ముంబైకి షాకులు తప్పలేదు. రోహిత్ అభిమానులు ముంబై ఇండియన్స్ ఫ్లాగ్ను తగులబెట్టడం, ఆ జట్టు యాజమాన్యాన్ని దూషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఫ్యాన్స్ ఆగ్రహంతో ముంబైకి మరో షాక్ తప్పలేదు. రోహిత్ ఫ్యాన్స్ దెబ్బకు ఇన్నాళ్లూ ఇన్స్టాగ్రామ్లో అత్యధిక మంది ఫాలో అయ్యే ఐపీఎల్ టీమ్గా ఉన్న ముంబై ఇండియన్స్ను చెన్నై సూపర్ కింగ్స్ అధిగమించింది.
రోహిత్ను తొలగించకముందు ఇన్స్టాగ్రామ్లో ముంబై ఇండియన్స్కు 13.9 మిలియన్ల ఫాలోవర్స్ ఉండేవాళ్లు. కానీ రోహిత్ను తొలగించి పాండ్యాను సారథిగా చేశాక ఆ జట్టు ఫాలోవర్స్ సంఖ్య 12.9కు పడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్కు ఇన్స్టాగ్రామ్లో 13 మిలియన్ల ఫాలోవర్స్ ఉండటంతో ఆ జట్టు ముంబైని అధిగమించినట్టైంది. ఇన్స్టాగ్రామ్తో పాటు ఎక్స్ (ట్విటర్)లో సీఎస్కే 10 మిలియన్ ఫాలోవర్స్తో మోస్ట్ ఫాలోడ్ ఐపీఎల్ టీమ్గా ఉన్న విషయం తెలిసిందే.
Chennai Super Kings is now officially the most followed cricket franchise on Instagram !
Mumbai Indians is no longer so called the ‘ largest family ‘
Don’t Mess With Rohit Sharma, Banaya humne hai bigadenge bhi hum#ShameOnMI #RohitSharma𓃵 #MumbaiIndians pic.twitter.com/kdSX52Jnj8
— VIVEK. ( MI KI MKC ) (@NotOutVivek) December 15, 2023
హిట్మ్యాన్ను తొలగించిన తర్వాత అతడి అభిమానులు సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ ఖాతాలను అన్ఫాలో చేస్తుండటంతో ముంబైకి షాకులు తప్పడం లేదు. ఇన్స్టా, ట్విటర్తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ముంబైకి అన్ఫాలోలు పెరుగుతున్నాయి. అంతేగాక ఎక్స్లో ‘షేమ్ ఆన్ ఎంఐ’, ‘అంబానీ’, ‘అన్ఫాలో’లు ట్రెండ్ అయిన విషయం తెలిసిందే.